ఆంధ్ర ప్రదేశ్ లో ఇంకా ఆయా పార్టీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న. విజయవాడలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సాయిరెడ్డి సూచనలు, సలహాలతోనే వైఎస్ జగన్ జైలుపాలు అయ్యారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు
అదేవిధంగా సాయిరెడ్డికి రోజూ చంద్రబాబు దండకం చదవనిదే నిద్రపట్టడం లేదని.. మే 23వ తేదీ తర్వాత వైసీపీ మట్టి కరచుక పోతుందని ఆయన తెలిపారు. వైఎస్ జగన్కు శకునిలా విజయసాయిరెడ్డి దాపరించారన్న ఆయన ఆరోపించారు. అంతేకాకుండా మే 23 తర్వాత మోడీ వ్యవహారలపై విచారణ ఉంటుందని తెలిపారు. ఫలితాల తర్వాత జగన్, సాయిరెడ్డి చంచల్గూడ్ జైలుకు వెళ్లడం ఖాయమని సంచలన వ్యాఖ్యలు చేశారు బుద్దా వెంకన్న. ఇక సీఎస్.. బీజేపీ డైరెక్షన్లో వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని ఆయన విమర్శించారు. జగన్ అవినీతి కేసులో ప్రస్తుతమున్న సీఎస్ ముద్దాయి అని తెలిపిన ఆయన వారణాసిలో కూడా మోడీ ఇరుకు సందుల్లో రోడ్షో నిర్వహించారని బుద్దా వెంకన్న వివరించారు.