తిరుపతిలో హైఅలెర్ట్

SMTV Desk 2019-04-27 19:22:50  tirupati high alert, high alert

తిరుమల: దక్షిణ భారత దేశంలోని నగరాలకు ఉగ్రవాదుల కుట్ర పొంచి ఉందని నిఘా వర్ఘల నుంచి వచ్చిన సమాచారంతో దాదాపు అన్ని రాష్ట్రాల్లో హైఅలెర్ట్ ను ప్రకటించారు. ఈ క్రమంలో తిరుపతిలో కూడా హైఅలర్ట్ ప్రకటించారు పోలీసులు. చెన్నై, బెంగళూరులో ఉగ్రవాదుల కదలికల నేపథ్యంలో అప్రమత్తం అయ్యారు. తిరుపతి రైల్వే స్టేషన్, బస్టాండ్ తో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. సిటీలోని ప్రధాన ప్రాంతాల్లో బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో చెకింగ్ చేస్తున్నారు. నగరంలో ఎవరైనా అనుమానంగా కనిపిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని పోలీసులు చెబుతున్నారు. అర్బన్ జిల్లా పోలీసులు హైఅలర్ట్ ప్రకటించటంతో రైల్వే పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రయాణికుల లగేజీని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అనుమానితులుగా కనిపించిన వారిని ప్రశ్నిస్తున్నారు. శ్రీలంక బాంబు పేలుళ్ళ అనంతరం ఉగ్రవాదులు దక్షిణబారతంలో దాడులు తెగబడే అవకాశం ఉన్నట్లు ఐబీ హెచ్చరికలు జారీ చేసింది.