బీజింగ్: ప్రముఖ రెస్టారెంట్ మెక్డొనాల్డ్స్లో ఓ మహిళా కొనుగోలు చేసిన చికెన్ వింగ్స్లో కోడి ఈకలు వచ్చాయంటూ ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేసిన వార్తా ఇప్పుడు నెట్లో హళ్ చల్ చేస్తోంది. వివరాల ప్రకారం...తాజాగా బీజింగ్ లో మెక్డానాల్డ్స్కు చెందిన ఓ రెస్టరెంట్లో మహిళ చికెన్ వింగ్స్ను పార్శీల్ చేయించుకుంది. అయితే, తన కుమార్తె వింగ్స్ తింటున్న సమయంలో ఈకలు ఉండటం గుర్తించింది. అప్పటికే తన కూతురు మూడు వింగ్స్ తినేసిందని, దాంతో కడుపంతా వికారంగా ఉన్నట్టు తనతో చెప్పిందని మహిళ ఆరోపించింది. దీంతో అనుమానం వచ్చి మిగతా వింగ్స్ను పరిశీలించగా వాటిలో ఈకలు ఉన్నట్లు గుర్తించామని చెప్పుకొచ్చింది. ఈ విషయమై తాను చికెన్ వింగ్స్ తీసుకున్న రెస్టారెంట్ను సంప్రదించానని, వారు తమను కాంపెన్జేషన్ ఇస్తామని మభ్యపెట్టారని తెలిపింది. కానీ, కాంపెన్జేషన్ను తిరస్కరించిన మహిళ సదరు రెస్టారెంట్పై స్టేట్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్కు ఫిర్యాదు చేసింది. ఆహార భద్రతపై మెక్డొనాల్డ్స్ తీసుకునే జాగ్రత్తలు ఇవేనా అంటూ మండిపడింది. కస్టమర్ల ఆరోగ్యం వారికి పట్టదా? వారికి బిజినెసే ముఖ్యమా? అని బాధితురాలు వాపోయింది.