కొలంబో: శ్రీలంకలో జరిగిన బాంబు పేలుళ్ళలో కర్ణాటకలోని జనతాదళ్ సెక్యులర్ (జేడిఎస్ )పార్టీకి చెందిన ఏడుగురు నేతలు అదృశ్యమయ్యారు. వీరిలో ఇద్దరు మృతి చెందినట్లు విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ వెల్లడించారు. నేతల మృతి పట్ల కర్ణాటక సియం కుమారస్వామి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జేడిఎస్కు చెందిన ఏడుగురు నేతలు ఎన్నికల ప్రచారం అనంతరం ఈ నెల 20న శ్రీలంక వెళ్లారు. కొలొంబోలోని హోటల్లో రెండు గదుల్లో బస చేసినట్లు సమాచారం. అదే చోట బాంబు పేలుడు జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నేతల ఆచూకీ కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. మరోవైపు ఈ ఘటనలో ఇప్పటివరకు మృతిచెందిన సంఖ్య 290 కి చేరింది. 500 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో ఆరుగురు భారతీయులున్నారు.