కొలంబో: ఆదివారం ఉదయం శ్రీలంకలో జరిగిన వరుస బాంబు పేలుళ్లలో మృతుల సంఖ్య 290కి చేరినట్లు అధికారులు వెల్లడించారు. అలాగే 550 మందికిపైగా ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఈ దాడులతో సంబంధం ఉన్న మొత్తం 24 మంది నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. మరోవైపు భద్రతా కారణాల దృష్ట్యా ఆదివారం దేశవ్యాప్తంగా విధించిన నిరవధిక కర్ఫ్వూను ఎత్తివేస్తున్నట్లు శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది.