అతను ఇలా చేస్తాడని అనుకోలేదు ?

SMTV Desk 2019-04-16 16:25:01  Lakshmi Parvtahi,

అమరావతి:తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డిని వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి కలిశారు. సోషల్ మీడియాలో తనను అగౌరవపరిచేలా కోటి అనే వ్యక్తి ప్రచారం చేస్తున్నాడంటూ లక్ష్మీపార్వతి ఫిర్యాదు చేశారు. మహిళలపై గౌరవం లేని అటువంటి వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఆమె డీజీపిని కోరారు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం జోరుగా జరుగుతున్న సమయంలో ఏప్రిల్ 4వ తేదీన లక్ష్మీపార్వతిపై కోటి అనే యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే . లక్షీపార్వతి తనని లైంగికంగా వేధిస్తుందని, తనకు ప్రాణ హాని ఉందంటూ ఫిర్యాదు చేశాడు. దీంతో ఒక్కసారిగా తీవ్రదుమారం రేగింది.

ఈ నేపథ్యంలోనే కోటి వెనుక ఎవరో ఉండి కుట్రలు చేస్తున్నారని, కోటితో తప్పుడు వార్తలు ప్రసారం చేసిన మీడియా ఛానల్, యాంకర్‌పై కూడా చర్యలు తీసుకోవాలని ఆమె డీజీపిని కోరారు. కోటి అనే వ్యక్తిని బిడ్డగా భావించానని, కానీ తాను ఇలా చేస్తాడనుకోలేదని లక్ష్మీపార్వతి తెలిపారు. లక్షీపార్వతి ఫిర్యాదుని స్వీకరించిన డీజీపీ మహేందర్ రెడ్డి కేసుపై పూర్తి దర్యాప్తు చేస్తానని తెలిపారు.