ఒక్కసారిగా పెరిగిన పసిడి ధర

SMTV Desk 2019-04-09 13:06:07  Gold Rate, Silver rate, Bullion market

సోమవారం ఇండియన్ మార్కెట్లో బంగారం ధర ఒక్కసారిగా పెరిగింది. అంతర్జాతీయ ట్రెండ్ సానుకూలముగా ఉండటం సహా జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ పెరగడం ఇందుకు కారణం. పది గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.425 పెరుగుదలతో రూ.33,215కు చేరింది. బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా నడిచింది. కేజీ వెండి ధర రూ.170 పెరుగుదలతో రూ.38,670కు ఎగసింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పెరగడం సానుకూల ప్రభావం చూపింది. ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.425 పెరుగుదలతో రూ.33,215కు, 22 క్యారెట్ల బంగారం ధర రూ.425 పెరుగుదలతో రూ.33,045కు చేరింది. ఇక ప్రభుత్వ సార్వభౌమ పసిడి పథకంలో 8 గ్రాముల బంగారం ధర రూ.26,400 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.కేజీ వెండి రూ.170 పెరుగుదలతో రూ.38,670కు చేరితే.. వారాంతపు ఆధారిత డెలివరీ ఏకంగా రూ.594 పెరుగుదలతో రూ.37,753కు చేరింది. ఇక 100 వెండి నాణేల కొనుగోలు, అమ్మకం విషయానికి వస్తే.. కొనుగోలు ధర రూ.80,000 వద్ద, అమ్మకం ధర రూ.81,000 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. హైదరాబాద్‌లో10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.32,060కు, 22 క్యారెట్ల బంగారం ధర రూ.30,530కు పెరిగింది. కేజీ వెండి ధర రూ.40,900కు చేరింది.