ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రధాని కార్యాలయంలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కార్యాలయంలోని ఆరో అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అదే సమయంలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఐదవ అంతస్తులో సమావేశంలో ఉన్నారు. ప్రధాని కార్యాలయానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది అందులో నుంచి ఉద్యోగులను తరలించి మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అగ్నిప్రమాదం వార్త తెలసుకున్న ప్రధాని సిబ్బందిని సురక్షితంగా బయటికి తరలించాలని ఆదేశాలు జారీ చేశారు.