ఓటేస్తే వీటిపై డిస్కౌంట్...!

SMTV Desk 2019-04-09 11:51:51  loksabha elections, assembly elections, petrol, diseal, vote

సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసిన వారికి కొందరు ఫ్యూయెల్ రిటైలర్లు డిస్కౌంట్ ధరకు పెట్రోల్, డీజిల్ అందించేందుకు రెడీ అవుతున్నారు. పోలింగ్ రోజున చేతికి సిరా మార్క్ చూపించి లీటరు పెట్రోల్, డీజిల్‌పై 50 పైసలు తగ్గింపు పొందొచ్చు. దేశవ్యాప్తంగా ఉన్న పలు నియోజకవర్గాల్లో ఈ సదుపాయం అందుబాటులో ఉండనుంది. ఆల్ ఇండియా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అజయ్ బన్సాల్ ఈ విషయాన్ని తెలియజేశారు. అన్ని పెట్రోల్ బంకుల్లో డిస్కౌంట్ లభించకపోవచ్చు. ఎంపిక చేసిన పెట్రోల్ బంకుల్లోనే ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. ప్రజాస్వామ్య పండుగైన పోలింగ్ డే‌ను విజయవంతం చేయడానికి తమ వంతు ప్రయత్నం చేస్తున్నామని బన్సాల్ తెలిపారు. ఇది వరకు ఢిల్లీలో డిస్కౌంట్ ధరను అమలు చేశారు. అయితే ఇప్పుడు 24 రాష్ట్రాల్లోని అసోసియేషన్ హెడ్స్ శుక్రవారం సమావేశమై పోలింగ్ రోజున పెట్రోల్, డీజిల్‌పై డిస్కౌంట్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. పోలింగ్ రోజున ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. ఓటు వేస్తేనే డిస్కౌంట్ పొందగలం. ఓటు వేసినట్లు వేలిపై ఉన్న సిరా గుర్తును చూపించాల్సి ఉంటుంది. అలాగే పెట్రోల్, డీజిల్ పట్టే వ్యక్తికి పేరు, మొబైల్ నెంబర్ కూడా ఇవ్వాలి. డిస్కౌంట్ ధరకే పెట్రోల్, డీజిల్ అందించే రిటైర్లు ఈ డిస్కౌంట్‌ను డీలర్ కమిషన్‌లో అడ్జస్ట్ చేసుకుంటారు.