కాంగ్రెస్ కి మరో షాక్

SMTV Desk 2019-04-04 16:48:16  congress, bjp,

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన కాంగ్రెస్ కి మరో షాక్ తగిలింది. పార్టీ సీనియర్స్ కాంగ్రెస్ ని వీడుతున్నారు. ఇప్పటికే చాలా మంది పార్టీని వీడగా తాజాగా మరికొందరు పార్టీని వీడారు. కాంగ్రెస్ పార్టీకి ఇటీవలనే రాజీనామా చేసిన ఆ పార్టీ మాజీ ఎంపీ రాపోలు ఆనంద్ భాస్కర్ ఈరోజు బీజేపీలో చేరనున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తీరుపై కొంత కాలంగా ఆయన అసంతృప్తితో ఉన్నారు. దీంతో ఆ పార్టీకి గత నెల 22వ తేదీన రాజీనామా చేశారు రాపోలు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం తనను నిర్లక్ష్యం చేసిందని రాజీనామా చేసిన సందర్భంగా ఆయన విమర్శలు చేశారు.

ఈయన ఈరోజు ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 10 గంటలకు బీజేపీ కండువా కప్పుకోనున్నారని అంటున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ కు చెందిన డీకే అరుణ బీజీపీలో చేరారు ఈరోజు ఆమె బాటలోనే రాపోలు కూడా పయనించనున్నారు.