వైసీపీ నేతల ఫోన్ ట్యాపింగ్...కీలక ఆదేశాలు !

SMTV Desk 2019-04-04 16:34:02  ycp

తమ ఫోన్లను అధికార పార్టీ పభుత్వం మద్దతుతో ట్యాప్ చేస్తుందంటూ తనతోపాటు తమ కొందరి నేతల ఫోన్లను పోలీసు అధికారులు ట్యాప్‌ చేస్తున్నారంటూ వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అలా వైసీపీ దాఖలు చేసిన పిటిషన్‌ మీద హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దీనిపై కొన్ని వివరాల్ని తమకు అందజేయాలని ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. ఫోన్ ట్యాపింగ్‌కు అనుమతి తీసుకోడానికి రివ్యూ కమిటీ ఏర్పాటు చేశారా ? ఇందుకు అనుమతి పత్రం సమర్పించారా ? దీనికి కమిటీ అనుమతి ఇచ్చిందా? అధికారికంగా ట్యాప్‌ చేశారా ? లేదా ? అన్నది తెలియజేయాలని కోరింది ధర్మాసనం.



అనంతరం ఈ కేసు తదుపరి విచారణ ఏప్రిల్ 9కి వాయిదా వేసింది. తమ ఫోన్లను ట్యాప్‌ చేస్తున్నారంటూ డీజీపీ, హోంశాఖ ముఖ్యకార్యదర్శి, ఇటీవల బదిలీ అయిన ఇంటిలిజెన్స్‌ డీజీలను ప్రతివాదులుగా పేర్కొంటు వైసీపీ నేత రామకృష్ణారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ సమయంలో వాదనలు వినిపించిన అడ్వకేట్ జనరల్ శ్రీనివాస్ ఇదే తరహా అభ్యర్థనతో వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి దిల్లీ హైకోర్టును ఆశ్రయించారని, దీనిపై విచారణ ఏప్రిల్‌ 15కు వాయిదా వేసిందని తెలిపారు. ట్యాపింగ్‌ కోసం పోలీసులు రాసినట్టు చూపుతున్న లేఖపై నిజానిజాలు నిగ్గు తేల్చాల్సి ఉందని అన్నారు. ఈ వివరాలను సమర్పించడానికి కొంత గడువు కావాలని కోరడంతో విచారణ వాయిదా వేశారు.