కడప నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఆరీఫుల్లా టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి సోమవారం రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖురేషి సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా పార్టీని బలోపేతం చేసే దిశగా ఖురేషిలకు అవసరమైన వాటిని అమలు చేయాలని పార్టీని కోరాను. ఖురేషి కార్పొరేషన్, అమరావతిలో ఖురేషి భవన నిర్మాణం, రాజకీయ గుర్తింపు ఇవ్వడంలో పార్టీ నాయకత్వం స్పందించలేదు. అందుకే రాజీనామా చేస్తున్నానని’ ఆయన తెలిపారు.