గ్వాటెమాలే : గ్వాటెమాలే నగరంలో ఓ ట్రక్కు బీభత్సం సృష్టించింది. గ్వాటెమాలే సిటీకి పశ్చిమం వైపున ఉన్న నౌహులా మున్సిపాల్టీలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఓ కారు ఓ వ్యక్తిని ఢీకొట్టడంతో అతను రోడ్డుపై పడిపోయాడు. అయితే ఆ రోడ్డుపై పడిన వ్యక్తిని చూసేందుకు వెళ్లిన ఓ గుంపుపైకి ట్రక్కు దూసుకువచ్చింది. ఆ ట్రక్కు ఢీకొనడంతో అక్కడే ఉన్న ఆ గుంపులోని 32 మంది చనిపోగా.. పలువురు గాయపడ్డారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు అంబులెన్స్ల్లో క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.