ఒడిశా, మార్చ్ 18: ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ రాష్ట్రంలో రానున్న లోక్ సభ ఎన్నికలకు అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. అలాగే శాసన సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. లోక్ సభతోపాటు రాష్ట్ర శాసన సభకు కూడా ఎన్నికలు జరుగుతుండడంతో నవీన్ పట్నాయక్ అభ్యర్థుల ఎంపికపై ప్రత్యేక కసరత్తు చేశారు. 9 లోక్ సభ స్థానాలకు, 54 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను పట్నాయక్ ఖరారు చేశారు.