వైసీపీ ప్రచారానికి టీఆర్ఎస్ కార్లు, సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్

SMTV Desk 2019-03-13 14:18:43  ysrcp, trs cars

అమరావతి, మార్చ్ 13: ఆంధ్ర ప్రదేశ్ లో రాబోయే ఎన్నికల్లో అధికార పార్టీని ఓడించేందుకు ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ, తెలంగాణాలో అధికార పార్టీ ఐన తెరాస రెండు కూడా చేతులు కలిపి తమ మీద కుట్రలు చేస్తున్నారని టీడీపీ మేటలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ వార్తలు నిజమే అనడానికి నెల్లూరు జిల్లాలో జరిగిన ఒక సంఘటన ఆధారంగా కనిపిస్తుంది. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ నేతలు వాడిన కార్లు అన్ని కూడా నెల్లూరు జిల్లాకు చేరుకున్నాయి. అది కూడా కెసిఆర్ గారి ప్రోద్బలంతో అని సమాచారం. కాగా ఆ వాహనాలకు అక్కడే టీఆర్ఎస్ స్టిక్కర్లు తొలగించి వైసీపీ పార్టీ కి సంబందించిన స్టిక్కర్లు కూడా అంటిస్తున్నారు. అంతేకాకుండా వాహనం లోపల సీట్లకు ఉండే టీఆర్ఎస్ కారు గుర్తును సైతం మార్చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.