బస్సు,కారు ఢీకొని ఇద్దరు మృతి

SMTV Desk 2019-03-12 11:55:14  Ananthapuram, two killed

అనంతపురం, మార్చ్ 12: బస్సు,కారు ఢీకొని ఇద్దరు మృతిచెందిన సంఘటనా జిల్లాలోని బత్తలపల్లి మండలం దంపెట్ల వద్ద అనంతపురం- చెన్నై జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లా రాయదుర్గం డిపోకు చెందిన ఆర్టీసి బస్సు కదిరి నుంచి అనంతపురం వైపు వెళ్తుండగా..మహారాష్ట్ర సోలాపూర్‌కు చెందిన పాల్ ప్రమోద్‌ సునీల్‌ యువకులతో కలిసి కారులో ఎదురుగా వస్తున్నారు. ఈ తరుణంలో దంపెట్ల వద్ద బస్సు, కారు ఢీకొనడంతో కారులో ఉన్న సునీల్‌, మరో యువకుడు సంఘటనా స్థలంలోనే మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను, గాయపడిన వారిని 108లో స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.