ముంబై, ఆగస్ట్ 7 : ఉద్యోగం నిమిత్తం అమెరికాలో ఉంటున్న ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ తన తల్లిని చూసేందుకు ఇండియా వచ్చాడు. ఇంటికి చేరుకొని ఒక్కసారిగా తలుపు తెరిచి చూసి షాక్ కి గురై అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఎదురుగా తన తల్లి విగతజీవిగా పడి ఉంది. వివరాల్లోకి వెళితే... అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్న రీతురాజ్ సహాని అనే వ్యక్తి అంధేరీలోని తమ అపార్ట్మెంట్ ప్లాట్ వద్దకు వెళ్లి తలుపులు తెరిచి చూస్తే ఎదురుగా తన తల్లి మృతదేహం కనిపించింది. పైగా ఆమె మృతదేహం కుళ్ళిన స్థితికి చేరుకుంది. ఈ సంఘటన చూసిన రీతురాజ్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. ఆ ఇంట్లో ఆమె ఒంటరిగా నివసిస్తుందని తనది సహజ మరణం కావొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించినట్లు తెలిపారు. ఆ రిపోర్ట్ వస్తేనే ఆమె ఎలా మరణించి౦దో తెలుస్తుందని పోలీసులు వెల్లడించారు.