టీడీపీ లోకి చేరిన గౌరు దంపతులు

SMTV Desk 2019-03-10 10:05:18  TDP, gowru dampathulu

విజయవాడ, మార్చ్ 10: గత కొంత కాలంగా తెలుగుదేశం పార్టీ లో చేరుతారు అని అనుకుంటున్న గౌరు దంపతులు ఎట్టకేలకు చంద్రబాబు సమక్షంలో టీడీపీ లో చేరారు… ఎమ్మెల్యే గౌరు చరిత దంపతులు టీడీపీ లో చేరడంతో చంద్రబాబు ఆనందపడ్డారు. వీరి చేరిక అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన గౌరు చరిత పాణ్యం అభివృద్ధికి చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు. జిల్లాకు తాగు, సాగు నీరు ఇచ్చేందుకు సీఎం కృషి చేస్తానని చెప్పారని గౌరు చరిత చెప్పుకొచ్చారు. పాణ్యాన్ని పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దిన చరిత్ర చంద్రబాబుదేనని ఆమె తెలిపారు. గుండ్రేవుల ఎత్తిపోతలకు శ్రీకారం చుట్టింది చంద్రబాబేనని.. కొందరు స్వార్థపరులు ముచ్చుమర్రికి అడ్డంకులు పెట్టారని గౌరు చరిత ఆరోపించారు. పాణ్యంలో చెరువుల అభివృద్ధి చేయాలని సీఎంను కోరానని గౌరు దంపతులు తెలిపారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ గెలిచేందుకు తనవంతు కృషి చేస్తానని చెప్పారు…