అమరావతి, మార్చ్ 05: అమరావతిలో నేడు ఏపీ కేబినేట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాభివృద్దికి గల పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
అందులోని కొన్ని విషయాలు :
•హైకోర్టు పర్యవేక్షణలో దరఖాస్తుల విశ్లేషణ, నగదు పంపిణీ వేగవంతం చేయాలి.
•అరకొర సాయంతో ఇబ్బందులు. రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచే తోడ్పాటు.
•కరవు సాయంగా కేంద్రం నుంచి పూర్తిస్థాయిలో నిధులు విడుదల లేదు.
• అగ్రిగోల్డు వ్యవహారం: ఫిబ్రవరి 8న హైకోర్ట్ ఆదేశాలకు అనుగుణంగా రూ.250కోట్ల డిస్బర్స్మంట్ (రూ.10వేల లోపు డిపాజిట్దారులందరికీ) ఆస్తుల వేలం వేగంగా జరిగేలా చూడాలని హైకోర్టును కోరాలి. బాధితులకు సత్వర న్యాయం చేయాలన్నదే ప్రభుత్వ సంకల్పం
•విజయనగరం జిల్లాలో చీపురుపల్లి కమ్యూనిటి హెల్త్ సెంటర్ను 50 పడకల స్థాయికి పెంపు
అదనంగా 17 పోస్టుల మంజూరుకు కేబినెట్ ఆమోదం