చిత్తూరు పర్యటనలో ఉన్నటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… మన రాష్ట్రము అభివృద్ధి చెందాలంటే వారసత్వ రాజకీయాలకు స్వస్తి పలకాలని, మన రాష్ట్ర భవిష్యత్తు నిర్వహించడానికి వారెవరు అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. వారు రాజకీయాన్ని వారి కుటుంబ గొడవల్లో కలుపుకొని నిర్ణయిస్తున్నారని పవన్ అన్నారు.
ప్రస్తుతం వ్యవసాయం కష్టతరంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ముస్లింలను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుంటున్నారని, రాష్ట్రంలో ఉపాధి లేక బెంగళూరు, చెన్నై వలస వెళ్తున్నారని చెప్పారు. మనదగ్గర ఉన్న నేతలందరూ కూడా అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారని పవన్ మండిపడ్డారు. మన రాష్ట్రము బాగుపడాలంటే ఇప్పటికైనా అందరు మేల్కొనండి అని పవన్ అన్నారు.