వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం..!

SMTV Desk 2019-03-04 15:59:47  venkatadri express

చిత్తూరు , మార్చ్ 03: చిత్తూరు నుంచి కాచిగూడ వెళ్లే వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది.కర్నూలు రైల్వే స్టేషన్‌లో రైలింజన్‌ పట్టాలు తప్పింది. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.. శనివారం రాత్రి చిత్తూరు నుంచి కాచిగూడకు బయలుదేరిన వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్.. ఆదివారం తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో కర్నూలు స్టేషన్‌లో పట్టాలు తప్పింది.

ఈ ఘటనతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. సిబ్బంది ట్రాక్‌ పునరుద్ధరణ పనులు చేస్తున్నారు. ఇటీవల అదే ప్రాంతంలో గూడ్స్‌ రైలు కూడా పట్టాలు తప్పడం గమనార్హం.డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న రైల్వే శాఖ సహాయక సిబ్బంది... ఘటనాస్థలికి చేరుకుని ట్రాక్ మరమ్మత్తులు చేపట్టారు.రైలుకు మరో ఇంజిన్ తగిలించి కాచిగూడకు పంపారు. ప్రమాదం కారణంగా ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.