హైదరాబాద్, ఫిబ్రవరి 28: వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తో నేడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ భేటీ అయ్యారు. గురువారం లోటస్పాండ్కు వచ్చిన జగన్ను లక్షీప్రసాద్ మార్యద పూర్వకంగా కలుసుకున్నారు. యార్లగడ్డకు ఎంపి విజయసాయి రెడ్డి స్వాగతం పలికి ఆహ్వానించారు. ఆయన రాయబోయే పుస్తకం పనిమీద జగన్ను కలవడానికి యార్లగడ్డ వచ్చినట్లుగా వైసిపి వర్గాలు చెబుతున్నాయి.