కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ కు ఏపీ సీఎం లేఖ...

SMTV Desk 2019-02-26 19:32:26  Central railway minister, Piyush goyal, chandrababu, tdp

అమరావతి, ఫిబ్రవరి 26: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ కు ఓ లేఖ రాశారు. ఆ లేఖలో చంద్రబాబు విశాఖ పట్టణంలో వెంటనే రైల్వేజోన్‌ ఏర్పాటు చేయాలని కోరుతూ... రాష్ట్ర విభజన చట్టంలో రైల్వేజోన్‌ ఏర్పాటు చేస్తామని పేర్కోన్న విషయాని ప్రస్తావించారు. వాల్తేర్‌ విజయవాడ, గుంటురు ,గుంతకల్‌ డివిజన్లతో జోన్‌ ఏర్పాటు చేయాలని,విభజన చట్టం ప్రకారం రైల్వేజోన్‌ ఏర్పాటు తమ హక్కు అని పేర్కోన్నారు. విశాఖ జోన్‌ రైల్వేజోన్‌ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకోవాలని అ లేఖలో బాబు చేప్పారు. రైల్వేజోన్‌ ఏర్పాటుకు నిపుణుల కమిటీ నివేదిక సిద్ధం చేసిందని చంద్రబాబు గుర్తు చేశారు