అప్పుడాయన.....ఇప్పుడీయన!!

SMTV Desk 2019-02-25 13:34:20  chandrababu, mahanayakudu, ntr biopic, mahesh bharat ane nenu

అమరావతి, ఫిబ్రవరి 25: మోదీ సర్కారు పై అవిశ్వాస తీర్మానంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఎంపీలు పార్లమెంట్ లో మాట్లాడాల్సిన సందర్భంలో..... ప్రజలపై ప్రభుత్వ పాలన ఎలా ఉండాలో, తెలుగులో ఆ మధ్య విడుదలైన మహేష్ బాబు చిత్రం భరత్ అనే నేను చక్కగా చెప్పింది అని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు.

అయితే ఎంపీ గల్లా జయదేవ్, సినీ నటుడు మహేష్ బాబు వరసకు బావ-బావమర్దులు అవుతారనే విషయం అందరికి తెలిసిందే. పార్లమెంట్ ప్రసంగంలో భాగంగా తనకి ఉన్న ఆ కొద్దిపాటి సమయంలో.....బావమరిది మహేష్ బాబు సినిమా ప్రస్తావన, అవకాశం కలిపించి మరి తీసుకొచ్చి, మొత్తం మీద పెద్ద పబ్లిసిటీయే కల్పించాడు అని రాజకీయ విశ్లేషకులు కొంతమేరకు అభిప్రాయపడ్డారని చెప్పక తప్పట్లేదు.

ఇదే తరహా ఇంకో విషయానికొస్తే...... లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాకి సంబంధించిన ఫోటో, వీడియో సాంగ్, టీజర్, ట్రైలర్ ఒక్కొక్కటిగా విడుదల చేస్తూ సంచలనం సృష్టించాడు. కాగా సినిమా అనుకున్నప్పటి నుండి నిజాన్ని నిక్కచ్చిగా చెప్తానని వర్మ పలు ఇంటర్వ్యూల్లో చెప్పడం కూడా జరిగింది.