పవన్-జగన్ కలిస్తే వార్ వన్‌ సైడ్: కత్తి మహేష్

SMTV Desk 2019-02-20 19:07:00  kathi mahesh

విజయవాడ, ఫిబ్రవరి 20: గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫై అలాగే జనసేన ఫై వరుస ట్వీట్స్ కురిపించి చివరకు రాష్ట్రం నుండి బయటకు పంపబడ్డ కాంట్రవర్సియల్ క్రిటిక్ కత్తి మహేష్ మళ్లీ వరుస ట్వీట్స్ తో రెచ్చిపోతున్నాడు. తాజాగా పవన్ కళ్యాణ్ ఫై ట్వీట్ చేసి మళ్లీ వైరల్ అయ్యాడు.

ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల సమరం మొదలు కాబోతుంది. అధికార పార్టీ తెలుగు దేశం మళ్లీ అధికారంలోకి రావాలని చూస్తుంటే , ఎలాగైనా ఈసారి సీఎం కుర్చీ దక్కించుకోవాలని వైసీపీ అధ్యక్షుడు జగన్ చూస్తున్నాడు. అలాగే జనసేన పవన్ సైతం రాజకీయాల్లో తన ఉనికిని చాటుకోవాలని చూస్తున్నాడు. ఈ ముగ్గురి మధ్య మంచి పోటీ ఉండబోతుందని అంత మాట్లాడుకుంటుంటే..కత్తి మహేష్ మాత్రం పవన్-జగన్ కలిస్తే వార్ వన్‌ సైడ్ అవుతుందంటూ సంచలన కామెంట్స్ చేశారు.

నిజంగా పవన్ కళ్యాణ్‌కి ముందుచూపు ఉంటే. చరిత్రహీనుడిగా మిగలకూడదు అనుకుంటే, వైఎస్సార్సీతో పొత్తు కుదుర్చుకుని వార్ వన్ సైడ్ చేసేయ్యాలి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అప్పుడు సమూలంగా మారే అవకాశం ఉంటుంది అంటూ కామెంట్ చేశాడు.

ఒకపక్క నేను ఎవరితోనూ కలవను.. సింగిల్‌గానే పోరాడతా.. అంటుంటే గతంలో సపోర్ట్ చేసిన టీడీపీని కాదని జగన్‌తో ఎలా కలుస్తాడు. ఆయన అవసరం వైసీపీ ఏం అవసరం లేదు అని వైసీపీ శ్రేణులు ఈ పోస్ట్‌పై స్పందిస్తుంటే.. పవన్ కళ్యాణ్ మీద ఉన్న నా ప్రేమను మీరు అర్ధం చేసుకోవడం లేదు అంటూ కత్తి రిప్లై ఇస్తున్నారు. మొత్తం మీద మరోసారి పవన్ ఫై ట్వీట్ చేసి మహేష్ వార్తల్లో నిలిచాడు.