రోడ్డెక్కిన ఆంధ్ర ప్రజలు... కేంద్రం స్పందించేనా..?

SMTV Desk 2019-02-01 13:43:34  Andhra Pradesh, Bandh, PCC Cheif Raghuveera Reddy, Chalasani Srinivas

ఆంధ్ర ప్రదేశ్, ఫిబ్రవరి 1: రాష్ట్ర హక్కుల సాధన కోసం ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు రోడ్డెక్కారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించడానికి శుక్రవారం రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చారు. విజయవాడలోని పండిట్ నెహ్రు బస్ స్టేషన్ వద్ద కాంగ్రెస్, సీపీఐ, సాధన సమితి ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఓట్‌ ఆన్‌ ఎకౌంట్‌ బడ్జెట్‌ సందర్భంగా ఎపి కి రావల్సిన అన్ని హామీలను ప్రత్యేక హోదాతో సహా ప్రకటించాలని కోరుతూ.. నినాదాలు చేశారు. పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి, ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ అందరూ కలిసి వస్తే హోదా సాధించడం కష్టం కాదని అన్నారు. ఐదేళ్ళ తర్వాత ఉద్యోగస్తులు కూడా బంద్ కు మద్ధతు పలికి రోడ్ల పైకి వస్తున్నారని అన్నారు. సినీ పరిశ్రమకు చెందిన వారు హోదా ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈరోజు మధ్యాహ్నం తర్వాత తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు.