మరో అడుగు వేసిన కడప స్టీల్ ఫ్యాక్టరీ..

SMTV Desk 2019-01-29 12:53:07  kadapa steel factory, kadapa, chaina team, chandrababu, CMD madhusudanarao

కడప, జనవరి 29: గత ఏడాది ఏపీ సీఎం చంద్రబాబు కడప ఉక్కు కర్మాగారం నిర్మాణానికై శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ పరిశ్రమకు సంబంధించి మరో అడుగు పడింది. పరిశ్రమకు శంకుస్థాపన జరిగిన ప్రాంతంలో చైనా దేశ ప్రతినిధుల బృందం పర్యటించింది. కడప జిల్లా మైలవరం మండల పరిధిలోని ఎం.కంభాలదిన్నె గ్రామ సమీపంలో గత డిసెంబరులో ముఖ్యమంత్రి చంద్రబాబు స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసారు. ఈ ప్రాంతాన్ని ఉక్కు సీఎండీ మధుసూదనరావుతో కలసి చైనా బృంద సభ్యులు పరిశీలించారు.

ఈ నేపథ్యంలో స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి అవసరమైన భూమి, నీరు, విద్యుత్తు, రహదారులు తదితర వనరులన్నీ అందుబాటులో ఉన్నాయని చైనా బృందంలోని టోనీ టాయ్, జియోజీ యువాన్, జె.పార్క్ లకు మధుసూదనరావు వివరించారు.