తూ. గో. జి, జనవరి 18: ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ అధ్యక్షుల తీరును ఆ పార్టీ నేతలే తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీరుపై బిజెపి నేత ఉంగరాల చినబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కన్నా మరో పార్టీకి కోవర్టుగా పని చేస్తున్నారని చినబాబు ఆరోపించారు. విభజన హామీలు అమలు చేయకపోవడంతోనే ఎమ్మెల్యేలు బిజెపిని వీడుతున్నారని ఆయన చెప్పారు.