విజయవాడ, జనవరి 13: ఏపీ సర్కార్ సంక్రాతి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు వరాల వర్షం కురిపిస్తోంది. శుక్రవారం చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్ర ప్రజాలకు పెన్షన్లు పెంపు చేయగా తాజాగా దివ్యాంగులకు మరో సంక్రాంతి కానుక ప్రకటించారు. రెండు చేతులు లేని వికలాంగులకు నెలకు పదివేలు పెన్షనివవ్వాలని నిర్ణయించారు.
ఈ నెలనుండే అమల్లోకి వచ్చేలా ఈ కానుక ఫిబ్రవరి నెల పెన్షన్తోపాటు కలిపి ఇవ్వనున్నారు. శుక్రవారం ప్రకటించిన వృద్దాప్య పెన్షన్కూడా జనవరి నెల మొత్తాన్ని కూడా ఫిబ్రవరి నెల నుండే అమలు చేయనున్నారు.