బీజింగ్, జూలై 28: చైనీస్ మీడియా భారత ప్రధానమంత్రిని ప్రశంసించడం ప్రారంభించింది. బీజింగ్ మీడియా మాట్లాడుతూ "మోడీ గొప్ప నాయకుడు", అలాగే భారత దేశ విదేశాంగ విధానాన్ని ప్రశంసిస్తూ, "భారత బహిరంగ విదేశీ ఆర్థిక విధానాన్ని కొనసాగిస్తోందని" కొనియాడింది. సరిహద్దు సమస్య పరిష్కారం కోసం భారత్కు సహాయం చేసేందుకు ముందుకు వచ్చిన యుఎస్ఎను చైనా హెచ్చరించిన నేపధ్యంలో ఈ ప్రశంసలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. "భారతదేశం చురుకుగా విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తోంది, గత రెండు సంవత్సరాలుగా, అనుకూలమైన పెట్టుబడి వాతావరణాన్ని సృష్టించింది మరియు ప్రపంచంలోని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు భారత్ అతిపెద్ద గమ్యస్థానంగా ఉంది" అని చైనా దినపత్రికలు వ్యాసాలు ప్రచురించాయి.