అమరావతి, డిసెంబర్ 31: ఆంధ్రప్రదేశ్లో 446 గ్రూప్-2 పోస్టులకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. 110 పాత పోస్టులతో పాటు 336 కొత్త పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో సచివాలయంలోని జీఏడీ విభాగానికి సంబంధించి జూనియర్ అసిస్టెంట్ లెవెల్ 150 పోస్టులు ఉన్నాయి. మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-3 పోస్టులు 3, డిప్యూటీ తహశీల్దార్, ఈవోపీఆర్డీ, ఆబ్కారీశాఖలో సబ్ ఇన్స్పెక్టర్లు, రిజిస్ట్రేషన్శాఖ, దేవాదాశాఖలో గ్రేడ్-2, గ్రేడ్ 1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసినట్లు ఏపీపీఎస్సీ తెలిపింది.