అమరావతి, డిసెంబర్ 31: ఏపీఎస్ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘమైన ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ) యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చింది. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబును యూనియన్ లీడర్లు సోమవారం కలిసి నోటీసును అందజేశారు. 50 శాతం వేతన సవరణతో పాటు అలవెన్సులను వందశాతం పెంచాలని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. సంస్థ నష్టాలకు అనుగుణంగా ప్రభుత్వ ఆర్థికసాయం అందించాలని, పదవీ విరమణ వయస్సును 60 ఏళ్లకు పెంచాలని తదితర డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు. సమ్మెకు స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (ఎస్డబ్ల్యూఎఫ్) మద్దతు ప్రకటించింది.