వైఎస్‌ఆర్‌సిపి నేతలకు సవాల్ విసిరిన నక్కా ఆనంద్‌బాబు

SMTV Desk 2018-12-24 14:32:51  YSRCP, TDP, Nakka aanand babu, BJP

గూంటూరు, డిసెంబర్ 24: మంత్రి నక్కా ఆనంద్‌బాబు వైఎస్‌ఆర్‌సిపి నేతలకు శ్వేతపత్రాల విషయంలో సవాల్ చేశారు. ఏపి ప్రభుత్వం విడుదల చేస్తున్న శ్వేతపత్రాలపై అభ్యంతరాలుంటే వైఎస్‌ఆర్‌సిపి నేతలు చర్చలకు సిద్ధం కావాలని ప్రజలకు నిజాలు తెలియలని శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నామని ఆయన తెలిపారు. గుంటూరు జిల్లా టిడిపి కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతు కేంద్ర ప్రభుత్వం ఏపికి చేసిన అన్యాయాన్ని శ్వేతపత్రాల ద్వారా స్పష్టంగా వివరిస్తున్నామని చెప్పారు. వైఎస్‌ఆర్‌సిపి బ్లాక్‌ పత్రాలు విడుదల చేస్తే ప్రజలే వారిని ప్రశ్నిస్తారన్నారు. ఇప్పడికైనా బిజెపితో పొత్తుపై జగన్‌ మాట్లాడాలని మంత్రి డిమాండ్‌ చేశారు.