తెలుగువారి ఆత్మగౌరవం కోసమే టిడిపి పుట్టింది : బాబు

SMTV Desk 2018-12-22 19:34:30  Andhrapradesh, CM, Chandrababu, BJP, Central governament

శ్రీకాకుళం, డిసెంబర్ 22: జిల్లాలోని ధర్మపోరాట సభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ కేంద్రంని న్యాయం చేయమని అడిగితే దాడులు చేస్తున్నారని భావితరాల కోసమే ధర్మపోరాటం చేస్తున్నామని ఆయన తెలిపారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసమే టిడిపి పుట్టిందని గుర్తుచేశారు. దైవసాక్షిగా ఇచ్చిన హామిని మోడి విస్మరించారని దుయ్యబట్టారు. మోడి కంటే నినే ఐదేళ్ల ముందే సిఎం అయ్యానని చెప్పారు. కేంద్రంపై తిరుగుబాటు తప్ప వేరే మార్గం లేదని స్పష్టం చేశారు. 11 రాష్ట్రాలకు హోదా ఇచ్చారు మనకెందుకు ఇవ్వలేదని చంద్రబాబు ప్రశ్నించారు.