విజయనగరం, డిసెంబర్ 22: బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్మాధవ్ తెదేపా గురించి ఆసక్తికర వాఖ్యానాలు చేశారు.
విజయనగరంలో శనివారం ఉత్తరాంధ్ర కార్యక్తల సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెదేపా కి తీవ్ర వ్యతిరేకత పెరుగుతుందని బిజెపి నేతలు టిడిపితో కలిసి నాలుగేళ్లు నీతిగానే పనిచేశారని ,చంద్రబాబు మధ్యలోనే ఆ బంధాన్ని తెంచేశారని అన్నారు.
అందుకే ఏపి కార్యకర్తలలో ఉత్సాహం నింపేందుకు వచ్చే నెల ఏపిలో ప్రధాని మోది పర్యటన చేపట్టనున్నారని తెలిపారు. చంద్రబాబు చేపట్టిన మహాకూటమి విఫలం అయ్యిందని, జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు, కేసిఆర్ ప్రభావం ఉండబోదని జోస్యం చెప్పారు.