శ్రీకాకుళం, డిసెంబర్ 20: వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో పర్యటిస్తున్నారు. జగనన్న తన ఊరికి వచ్చాడని తెలుసుకున్న ఓ బాలిక, అన్న దగ్గరికి తీసుకెళ్లాలని తల్లిదండ్రులు కోరగా వారు కుదరదని చెప్పడంతో, దీంతో ఆ పాప రెండు కిలోమీటర్ల పాటు పరిగెత్తి, సెక్యూరిటీని దాటుకుని జగన్ ను చేరుకుంది. ఈ ఘటనతో జగన్ సైతం కొంతసేపు భావోద్వేగానికి లోనై, పాదయాత్రను నిలిపివేసి ఆ పాపను హక్కున చేర్చుకుని ఓదార్చారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా టెక్కలి సమీపంలోని కొత్తపేట వద్ద జరిగింది.
9వ తరగతి చదువుతున్న పేడాడ లలిత, జగన్ ను చూడాలన్న పట్టుదలతో అర కిలోమీటర్ మేర పాదయాత్రను అనుసరించింది. అయిన జగన్ ను చేరుకోలేకపోయిన ఆమె, పరుగెత్తుతూ వచ్చి, సెక్యూరిటీని దాటి జగన్ ను చూసి బోరున ఏడ్చింది. ఏం జరిగిందో అర్థంకాని జగన్ లలితను దగ్గరకు తీసుకుని "ఏమైంది తల్లీ.. ఎందుకు ఏడుస్తున్నావు?" అని అడగటంతో ఆ పాప మరింతగా ఏడ్చింది. గుక్కపెడుతూ జగన్ ను గట్టిగా పట్టుకుంది. "ఏమైంది తల్లీ.. ఎందుకు ఏడుస్తున్నావు?" అని మల్లి అడగగా నిన్ను చూడటానికి తీసుకెళ్లమని అమ్మానాన్నలనిఅడిగితె వారు కుదరదు అన్నారు. అందుకే పరిగెత్తుకుంటూ వచ్చేసా, రెండు కిలోమీటర్లు పరిగెత్తడంతో ఏడుపు వచ్చిందని పాప చెప్పడంతో చలించిపోయిన జగన్, ఆమెను సముదాయిస్తూ, ఆత్మీయంగా గుండెలకు హత్తుకుని ఓదార్చారు. ఆపై పాప వివరాలు అడిగి తెలుసుకుని, తానున్నానని, బాగా చదువుకోవాలని చెప్పి, పాపను క్షేమంగా ఇంటికి చేర్చాలని తన సిబ్బందిని ఆదేశించారు.