చంద్రబాబుపై జగన్ ఫైర్..!

SMTV Desk 2018-12-18 11:05:54  Jaganmohan Reddy, Chandra Babu

అమరావతి, డిసెంబర్ 18: వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్, ఏపీ సీఎం చంద్రబాబును "టీఆర్ఎస్ తో పొత్తుకు వెంపర్లాడిన మీకు మమ్మల్ని విమర్శించే హక్కుందా?" అని ప్రశ్నించారు. ఈ విధంగా తన ఫేస్ బుక్ పేజీలో ఓ పోస్టు పెట్టిన ఆయన, "చంద్రబాబు గారూ... ప్రజలు మీ దృష్టిలో అమాయకులా? లేదా ఎల్లో మీడియా ఉందన్న ధైర్యమా? టీఆర్ఎస్ తో పొత్తుకు ఎందుకు వెంపర్లాడావు? హోదాను వద్దని ఉంటే అదే పార్టీతో ఎందుకు మంతనాలు జరిపావు? హరికృష్ణ భౌతికకాయం సాక్షిగా పొత్తు పెట్టుకుందామని కేటీఆర్ ను ఎలా అడిగావు? ఊసరవెల్లి కన్నా వేగంగా రంగులు మార్చి మమ్మల్ని విమర్శిస్తావా?" అని జగన్ ప్రశ్నలు సంధించారు. చంద్రబాబు ని టాగ్ చేసి మరి ఆయన ఈ పోస్ట్ పెట్టారు, కాగా ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. దీనిపై నెటీజెన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.