లండన్, నవంబర్ 17: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస పార్టీ ప్రచారాల్లో దూసుకుకేల్తున్న విషయం తెలిసిందే. వీరి ప్రచారం స్వదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా కారు జోరు చూపిస్తున్నారు. లండన్లోని తెలంగాణ పౌరులందరూ కలిసి టిఆర్ఎస్కు అనుబంధంగా ప్రచార విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఇందుకోసం వొక కార్యాలయాన్ని అక్కడ నెలకొల్పారు.
తెలంగాణ ప్రభుత్వం ఈ నాలుగన్నరేళ్లలో అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను వివరించడం, అభివృద్ధి కార్యక్రమాల ద్వారా దేశ స్థాయిలో విస్తృతంగా ప్రచారం చేయనున్నారు. లండన్ నుంచే తెలంగాణలోని ఓటర్లకు ఫోన్ చేసి ఆ పార్టీకి ఓటు వేయాల్సిందిగా అభ్యర్ధించనున్నారు