అమరావతి, అక్టోబర్ 29; జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో జనసేన ఏ పార్టీ తో పోట్టుపెట్టుకుంది అని వస్తున్న వార్తలపై స్పందించారు. రాబోయే ఎన్నికల్లో తాము వొంటరి పోరుకే సై అంటున్నామని తేల్చి చెప్పేసారు. జనసేన పార్టీకి ఎవరి అండ దండలు అవసరం లేదని పవన్ పేర్కొన్నారు. ఆదివారం ఆయన ట్విటర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు.
అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టు, జనసేన,ఆ పార్టీ తో కలుస్తుంది,యీ పార్టీ తో కలుస్తుంది అని కొందరు అంటే, కలవడం ఏంటి? సీట్ల సర్దుబాటు కూడా అయిపాయిందని ఇంకొందరు అంటున్నారు; మనకి ఎ పార్టీ అండ దండా అక్కర్లేదు, “మన బలం జనం చూపిద్దాం ప్రభంజనం.”
— Pawan Kalyan (@PawanKalyan) October 28, 2018
‘ అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లు.. జనసేన ఆ పార్టీతో కలుస్తుంది.. ఈ పార్టీతో కలుస్తుంది.. అని కొందరు అంటున్నారు. సీట్ల సర్దుబాటు కూడా అయిపోయిందని ఇంకొందరు అంటున్నారు. మనకు ఏ పార్టీ అండ దండా అక్కర్లేదు. మన బలం జనం. చూపిద్దాం ప్రభంజనం’ అని పవన్ ట్వీట్ చేశారు.