తూ.గో.జిల్లా, అక్టోబర్ 24: ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గాదెలపాలెం గ్రామంలో నూతన సిసి రోడ్లును ప్రారంభించారు. తూ.గో.జిల్లా గోకవరం మండలంలోని గాదెలపాలెం గ్రామంలో గ్రామదర్శిని కార్యక్రమంలో భాగంగా నూతన సిసి రోడ్లును ప్రారంభించి, ప్రజాసమస్యలు తెలుసుకుని, పార్టీ జెండా ఆవిష్కరించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. దొడ్డా విజయ్ అధ్యక్షతన ఈ కార్యక్రమంలో జనపరెడ్డి బాబు, గళ్లా రాము, పాలూరి బోసుబాబు, ఈది అశోక్, తుమ్మలపల్లి గంగాధర్, దాసరి తమ్మన్నదొర తదితరులు పాల్గొన్నారు.