ముగిసిన జనసేనాని దీక్ష ..

SMTV Desk 2018-05-26 18:16:09  pawan kalyan. pawan hunger strike stop, srikakulam, uddhanam

శ్రీకాకుళం, మే 26 : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శనివారం సాయంత్రం ఐదుగంటలకు నిరాహార దీక్షను విరమించారు. ఉద్దానం ప్రాంతంలో మూత్రపిండాల సమస్యపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం సాయంత్రం దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. తాను రాజకీయ లబ్దికోసం ఈ దీక్ష చేయలేదని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.."ఉద్దానం వెనుకబడ్డ ప్రాంతం కాదు. వెనక్కి నెట్టబడిన ప్రాంతం. రూ.2,000 కోట్లు పుష్కరాలకు ఖర్చుపెట్టిన వారు.. జబ్బుతో 20,000 మంది చనిపోయిన చోట ఖర్చు పెట్టలేరా. రాష్ట్రాన్ని మోసం చేసిన కేంద్రం, ఆ కేంద్రానికి మద్దతిచ్చిన తెలుగుదేశంపై నిరసనగా ఆందోళన చేపట్టాను. సామాజిక రాజకీయ చైతన్యం కోసం జనసేన పార్టీ పని చేస్తుంది. రాష్ట్రంలో పారిశ్రామిక వేత్తలను సమావేశపరిచి కార్పొరేట్‌ సామాజిక బాధ్యత కింద ఉద్దానం సమస్యను పరిష్కరించవచ్చు" అని ఆయన వెల్లడించారు.