పుల్లంపేట, ఏప్రిల్ 29: కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పుల్లంపేట ఆదర్శ పాఠశాల సమీపంలో ఆదివారం మధ్యాహ్నం లారీ-తూఫాన్ వాహనం ఢీకొన్న ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను రాజంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో నలుగురు మహిళలు, చిన్నారి ఉన్నారు. బాధితులు అనంతపురం జిల్లా గుంతకల్లు వీరప్పగుడి వాసులుగా గుర్తించారు. వీరంతా గుంతకల్లు నుంచి తిరుపతిలో బంధువుల వివాహానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.