విశాఖపట్నం, ఏప్రిల్ 29: ఈరోజు పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల కానున్నాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయం కాన్వొకేషన్ హాలులో సాయంత్రం 4 గంటలకు మానవ వనరుల శాఖమంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేయనున్నారు. తొలుత ఏయూలోని వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేయాలని భావించినా, ఆ సమయానికి విద్యాశాఖ కమిషనర్, ఇతర ఉన్నతాధికారులు చేరుకోలేరన్న ఉద్దేశంతో సాయంత్రానికి మార్చినట్లు తెలిసింది. విద్యాశాఖ అధికారులు ఫలితాల విడుదలకు అన్ని ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశారు.