అమరావతి, ఏప్రిల్ 25: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ నరసింహన్పై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. కుట్రలు, కుతంత్రాల్లో గవర్నర్ పాత్రధారిగా ఉంటున్నారని మంత్రి నక్కా ఆనంద్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ వ్యవహారాల్లో గవర్నర్ జోక్యం చేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ- భారతీయ జనతా పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా కేంద్రంగా కుట్ర జరుగుతోందని, అందులో గవర్నర్ నరసింహన్ పాత్రధారని ఆనందబాబు ఆరోపించారు. అంతేగాక, అన్ని కుట్రల్లోనూ గవర్నర్ సూత్రధారిగా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. గవర్నర్ అసలు వైఖరి ఇప్పుడు బయటపడిందని, అందుకే తాము ఆయనను వ్యతిరేకిస్తున్నామని చెప్పారు.