రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి..

SMTV Desk 2018-03-11 11:18:11  chittor, road accident, 4 members passed away.

బంగారుపాళ్యం, మార్చి 11: చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం మాధవన్ నగర్ వద్ద జాతీయ రహదారిపై ఈ ఉదయం జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో ఓ మహిళతో సహా నలుగురు మృతి చెందారు. కేరళ నుంచి తిరుమల శ్రీవారి దర్శనం కోసం వస్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సు, టెంపో ట్రావెలర్‌ను ఢీకొనటంలో ఈ ప్రమాదం సంబవించింది. ఈ ఘటనలో మరో నలుగురికి తీవ్ర గాయాలు కావడంతో వారిని బంగారుపాళ్యం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులను కేరళ రాష్ట్రంలోని కసరకోడ్ వాసులుగా గుర్తించారు.