ప్రాణం తీసిన పెళ్లి ఫ్లెక్సీ

SMTV Desk 2017-06-26 13:49:34  marriage, power, death, guntur

గుంటూరు, జూన్ 26 : సోమవారం సాయంత్రం పెళ్లి భాజాలు మొగాల్సిన ఆ ఇంట్లో ఒక్కసారిగా విషాద చాయలు అలుముకున్నాయి. ఒక్కసారిగా అందరి లో తీవ్ర దిగ్బ్రాంతి నెలకొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ మండలం జానపాడు గ్రామంలో ఇస్రామేలు - పరిసుదం దంపతుల కుమారుడు కోటి వివాహం సోమవారం సాయంత్రం జరుగాల్సి ఉంది. ఈ సందర్భంగా పెళ్లి కుమారుడి తండ్రి ఇస్రామేలు (45) పెళ్లి పనుల్లో భాగంగా అతని మేనల్లుడు ఆకాశ్ (12) తో కలిసి ఫ్లెక్సీ కడుతున్న సమయంలో ఆకస్మతుగా విద్యుత్ ఘాతుకం చోటు చేసుకుంది. ఈ ఘటనలో మరో ముగ్గురికి తీవ్రగాయలయ్యాయి. వారిని పిడుగురాళ్లలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారని పోలీస్ లు వెల్లడించారు.