అతి వేగం ఒక ప్రాణాన్ని బలికోంది

SMTV Desk 2017-06-18 16:32:13  car, laari, tankat

ఏలూరు, జూన్ 18 : ఏలూరు సమీపంలో వేగంగా వెళ్తున్నకారు లారీని దాటుతుండగా ఎదురుగా వస్తున్న ట్యాంకర్ ను ఢీకొంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్రగాయలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం .. కృష్ణ జిల్లా నాగాయలంకకు చెందిన ఉప్పల శ్రీకాంత్ బెంగుళూర్ లో పని చేస్తుంటాడు. తాడేపల్లి గూడెంలో తను పనిచేసే కంపెనీ తరుపున మీటింగ్ ఉండటం తో నాగాయలంక నుంచి కైకలురుకు చేరుకున్నాడు. అక్కడ గుడివాడకు చెందిన చోడవరపు హరి గోపాల్ , కైకలూరు కు చెందిన పెనుమత్స అశోక్ వర్మ, మాటూరి వెంకటేష్ లతో శ్రీకాంత్ శనివారం ఉదయం కారులో కైకలూరు నుంచి తాడేపల్లిగేడెం బయల్దేరారు. ఏలూరు సమీపంలో మాదేపల్లి గురకల పేట వద్ద కారు లారీ కంటే వేగంగా వెళ్ళే క్రమంల్లో ఎదురుగా వస్తున్న ట్యాంకర్ ను ఢీ కొట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించగ, అశోక్ వర్మ (25) చనిపోయాడని వైద్యులు వెల్లడించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయాలతో చికిత్స పొందుతున్నట్లు పేర్కొన్నారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు మృత దేహాన్ని పోస్టుమార్టంకు పంపించి కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.