టిఆర్ఎస్ నేత మృతి

SMTV Desk 2017-07-28 12:11:45  road, accident, trs, leader, death

నార్కట్ పల్లి, జూలై 28 : శుక్రవారం తెల్లవారు జామున నార్కట్ పల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో టిఆర్ఎస్ నేత దుబ్బాక సతీష్ రెడ్డి (48) మృతి చెందారు. సతీష్ రెడ్డి విశాఖపట్నం నుంచి చిట్యాల వస్తుండగా నల్గొండ వద్ద ఈ ప్రమాదం జరిగింది. నార్కట్ పల్లి వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు.సతీష్ రెడ్డి నల్గొండ నియోజకవర్గ టిఆర్ఎస్ ఇంచార్జ్ దుబ్బాక నరసింహా రెడ్డి సోదరుడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.