హైదరాబాద్, జూలై 21 : నగరాన్ని మాదకద్రవ్యాలు పట్టి పీడిస్తున్నాయి. అయితే సినీ పరిశ్రమకు చెందిన కొందరు ప్రముఖులకు ఈ డ్రగ్స్ కేసులో సంబంధం ఉందా? లేదా? అన్న దానిపై రెండు రోజుల నుంచి సినీ ప్రముఖులలో ఒక్కోకరిని ఎక్సైజ్ శాఖ అధికారులు సిట్ కార్యాలయానికి పిలిపించి విచారణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో డైరెక్టర్ పూరి జగన్నాథ్ ను దాదాపు పది గంటల పాటు సిట్ అధికారులు విచారించారు. మరునాడు కెమెరా మాన్ శ్యామ్ కెన్ నాయుడును మాత్రం ఆరు గంటల పాటే విచారించారు. నేడు సుబ్బరాజును డ్రగ్స్ కేసు లో సిట్ కార్యాలయం వద్ద అధికారులు విచారించనున్నారు. మరి సుబ్బరాజును సిట్ అధికారులు ఎన్ని గంటల పాటు విచారించానున్నారో వేచిచూడాల్సిందే.