కొడుకు పుట్టిన రోజున తండ్రి హత్య

SMTV Desk 2017-07-19 12:02:14  On the, birthday, of, the, son, the, father, killed

ముజఫర్ నగర్, జూలై 19 : కొడుకు పుట్టిన రోజున కేక్ కొనడానికి వెళ్లిన ఓ తండ్రిని హత్య చేశారు. తమ కుమార్తెను పెళ్లి చేసుకున్నాడనే కోపంతో అతని మామ కాల్చి చంపిన ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని ముజుఫర్ నగర్ లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... బొకరేది గ్రామానికి చెందిన నజీమ్ అహ్మద్, పింకి కుమార్ చిన్ననాటి నుంచి స్నేహితులు... అలా వీరి స్నేహం ప్రేమగా మారి పెళ్లి చేసుకుందామని అనుకున్నారు. కాని వీరి పెళ్ళికి పింకి తల్లిదండ్రులు అంగీకరించలేదు. దీంతో 2015 లో ఇంట్లో నుంచి వెళ్ళిపోయి వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో నివాసం ఉంటున్నారు. పెళ్లి అయ్యాక పింకి తన పేరును అయేషా గా మార్చుకుంది. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అయితే గత నెలలో రంజాన్ పండుగా కావడంతో నజీమ్ కుటుంబం తో కలిసి మొదటి సారి సొంత ఉరికి వచ్చాడు. గత సోమవారం కుమారుడి పుట్టిన రోజు కావడంతో కేక్ కొనడానికి నజీమ్ అతని బందువు నజర్ అహ్మద్ తో కలిసి షాప్ కు వెళ్ళాడు. కేక్ తీసుకొని వస్తుండగా నలుగురు వ్యక్తులు నజీమ్ పై దాడి చేసారు. గన్ తో అతి దగ్గర నుంచి కాల్చడంతో నజర్ అక్కడికక్కడే చనిపోయాడు. దీంతో దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటన పై నజీర్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హత్య చేసింది నజీమ్ అత్తింటి వారేనని నజర్ పోలీసులకు తెలిపాడు. కేసు నమోదు చేసుకున్న నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసులు వెల్లిడించారు.